Alibaba-Paytm | చైనా ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా గ్రూప్.. భారత్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం నుంచి 125 మిలియన్ల విలువైన షేర్లను బ్లాక్ డీల్లో గురువారం విక్రయించిందని సమాచారం. దీంతో స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో గురువారం మధ్యాహ్నం పేటీఎం షేర్ 8.8 శాతం నష్టపోయి రూ.528కి చేరింది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పేటీఎం షేర్ పతనం 5.8 శాతానికి తగ్గింది.
గత సెప్టెంబర్ నెలాఖరు నాటికి పేటీఎంలో అలీబాబాలో 6.26 శాతం వాటా ఉంది. అయితే షేర్ విలువ రూ.536.95 చొప్పున ఆ వాటా మొత్తం విక్రయించినట్లు తెలిపింది. ఈ వాటా విక్రయించేయాలని అలీబాబాకు ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సూచించినట్లు సమాచారం. దీనిపై అలీబాబా, మోర్గాన్ స్టాన్లీ స్పందించలేదు.
డిసెంబర్ త్రైమాసికంలో పేటీఎం బలంగా ఉందని వార్తలు రావడంతో సంస్థ స్టాక్ క్రితం ముగింపులో సుమారు 9 శాతం పెరిగింది. గతేడాది 60 శాతం నష్టంతో ముగిసింది. డిసెంబర్లో షేర్ల బైబ్యాక్ ప్రకటించినా పేటీఎం కోలుకోలేకపోయింది. పేటీఎంలో సాఫ్ట్ బ్యాంకుకు గత సెప్టెంబర్ నాటికి 17.5 శాతం వాటా ఉంది. సాఫ్ట్ బ్యాంక్ గతేడాది నవంబర్లో 4.5 శాతం వాటా విక్రయించింది.