Alibaba | చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు కొత్త సారధులు వచ్చారు. ఎనిమిదేండ్లుగా చైర్మన్గా పని చేస్తున్న డేనియల్ ఝాంగ్ను తప్పించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్న జోసెఫ్ సాయ్ నియమితులయ్యారు. సంస్థలో కీలకంగా ఉన్న టావోబావో – మాల్ ఆన్లైన్ వాణిజ్య విభాగాల చైర్మన్గా పని చేస్తున్న ఎడ్డి వూ.. గ్రూప్ సీఈఓగా పని చేస్తారు.
కరోనా మహమ్మారి తర్వాత పుంజుకోవడంలో విఫలమైన అలీబాబా షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు, ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై విమర్శలతో అలీబాబా కో-ఫౌండర్ జాక్ మా మీద కొరడా ఝులిపించింది జిన్ పింగ్ సర్కార్. ఆయనతోపాటు ఆయన సారధ్యంలోని యాంట్ గ్రూప్ పైనా ఆంక్సలు విధించడంతో అలీబాబా కూడా పూర్వ వైభవం సంపాదించుకోలేకపోయింది.
కొత్తగా చైర్మన్, సీఈఓలుగా నియమితులైన జోసెఫ్ సాయ్, ఎడ్డీ వూ కూడా జాక్ మాకు అత్యంత సన్నిహితులు. వీరిద్దరూ అలీబాబా సహ వ్యవస్థాపకులు కూడా. ఇదిలా ఉంటే సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ విభాగానికి డేనియల్ ఝాంగ్ సారధ్యం కొనసాగుతుందని అలీబాబా తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి లాజిస్టిక్స్, అంతర్జాతీయ వాణిజ్యంలో కంపెనీని పటిష్టం చేస్తామని ఇటీవలే అలీబాబా ప్రకటించింది. ఇందుకు పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సంస్థ చైర్మన్గా డేనియల్ ఝాంగ్ని తప్పించడం ఆసక్తికరంగా మారింది.