న్యూఢిల్లీ, నవంబర్ 21: భారతీ ఎయిర్టెల్ తమ కనీస నెలసరి రీచార్జ్ ప్లాన్ ధరను పెంచింది. రూ.99 విలువ కలిగిన 28 రోజుల మొబైల్ఫోన్ సర్వీస్ ప్లాన్ రేటును దాదాపు 57 శాతం పెంచుతూ రూ.155గా మార్చింది. అయితే ప్రస్తుతానికి హర్యానా, ఒడిషా టెలికం సర్కిళ్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని సంస్థ వెబ్సైట్ ప్రకారం తెలుస్తున్నది. కానీ కస్టమర్ల ప్రతిస్పందననుబట్టి త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే వీలున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, రూ.99 ప్లాన్లో 200 ఎంబీ డాటా ఉంటుంది. అయితే రూ.155 ప్లాన్లో 1జీబీకి పెరిగింది. అలాగే 300 ఎస్ఎంఎస్లూ లభిస్తాయి. మరోవైపు ఈ నిర్ణయంపై పంపిన సందేశానికి ఎయిర్టెల్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. గతంలో రూ.79 ప్లాన్ ధరను రూ.99గా మార్చినప్పుడూ ఇటువంటి పద్ధతినే సంస్థ ఆచరించింది.