Airtel Xstream AirFiber | పట్టణాలతోపాటు గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ (Airtel) సిద్ధమైంది. ఇందుకోసం ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ (Xstream AirFiber) అనే ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసును ప్రారంభించింది. ముందు ఢిల్లీ, ముంబై నగరాల్లో యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో లేని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి ఎయిర్ ఫైబర్ (Xstream AirFiber) కనెక్షన్ ఉపకరిస్తుందని ఎయిర్టెల్ (Airtel) వెల్లడించింది.
ఎక్స్ ట్రీమ్ ఎయిర్ఫైబర్ (Xstream AirFiber) ఫ్లగ్ అండ్ ప్లే డివైజ్.. ఇది వై-ఫై-6 టెక్నాలజీతో పని చేస్తుంది. ఈ ఎయిర్ ఫైబర్ వైర్లెస్ కనెక్షన్కు గరిష్టంగా 64 డివైజ్లు కనెక్ట్ చేసుకునే వీలు ఉంది. ఇది ఎయిర్టెల్ స్టోర్లలో లభిస్తుంది. ఈ ఎయిర్ ఫైబర్ కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్ ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ((Xstream AirFiber) యాప్ డౌన్లోడ్ చేసుకుని.. డివైజ్ మీద ఉన్న క్యూ-ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వై-ఫై నెట్ వర్క్కు నెట్ వర్క్ కు అనుసంధానించుకోవచ్చు.
ఎయిర్ఫైబర్ ((Xstream AirFiber) నెలవారీ టారిఫ్ రూ.799 అని ఎయిర్ టెల్ నిర్ణయించింది. 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. ఆరు నెలలకొకసారి టారిఫ్ కొనుగోలు చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో రూ.2,500 పే చేయాలి. టారిఫ్పై 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రూ.7,733 పే చేయాలి. దీనిపై జీఎస్టీ అదనం. ఇప్పుడైతే సింగిల్ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉన్నదని ఎయిర్టెల్ తెలిపింది.