న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: యూరప్కు చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా..భారత్లో మరో రెండు రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు, ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు ఈ ఏడాది విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించింది.
దేశీయ విమాన మార్కెట్ చాలాచాలా ముఖ్యమైనదని లుఫ్తాన్సా గ్రూపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ హ్యారీ హోమీస్టర్ తెలిపారు. నవంబర్ 3 నుంచి మ్యూనిచ్ నుంచి బెంగళూరు రూట్లో విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండగా, అదే సీజన్లోనే ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ సర్వీసుకు కూడా ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్కు వారానికి 50 సర్వీసులు నడుపుతున్నది.