న్యూఢిల్లీ, జనవరి 24: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు ఈ వారంలోనే అప్పగించే వీలున్నదని సోమవారం సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గతేడాది అక్టోబర్ 8న టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్.. పోటీ బిడ్డింగ్లో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.18,000 కోట్ల ఈ డీల్లో అక్టోబర్ 11న లెటర్ ఆఫ్ ఇంటెంట్ను టాటాలకు అందించిన కేంద్రం.. 25న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై సంతకం చేసిన సంగతీ విదితమే.