AIR INDIA TO TATA | నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ టేకోవర్ చేయడం ఒక నెల ఆలసమయ్యేలా కనిపిస్తున్నదని ఓ అధికారి చెప్పారు. ఎయిర్ ఇండియాలో 100 శాతం.. దాని అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 50 శాతం వాటాలను టేకోవర్ చేసుకునేందుకు టాటా సన్స్ దాఖలు చేసిన బిడ్ను కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి ఒప్పందం ప్రకారం టాటా సన్స్ రూ.2700 కోట్ల నగదు చెల్లించడంతోపాటు ఎయిరిండియా అప్పగింత పూర్తవుతుందని బిడ్ ఖరారు టైంలో కేంద్రం ప్రకటించింది.
ఎస్పీఏ షరతుల ప్రకారం టాటా సన్స్కు ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ ఎనిమిది వారాల్లోపు పూర్తవుతుందని అధికార వర్గాల కథనం. ఇరు పక్షాల పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని నియంత్రణ సంస్థల నుంచి అప్రూవల్స్ రావాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి. టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత ప్రక్రియ వచ్చే జనవరికి పూర్తవుతుందన్నారు ఆ అధికారి. కానీ ఖచ్చితమైన తేదీ ఏమీ ప్రకటించలేదు.