హైదరాబాద్, అక్టోబర్ 20: మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) కలిసి ఒక సమగ్ర అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఏఐజీ హాస్పిటల్స్ తెలిపింది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు తొలిదశలోనే స్క్రీనింగ్ ప్రాధాన్యతను మహిళలకు తెలియపరుస్తామని పేర్కొంది.
ఈ సందర్భంగా తమ హాస్పిటల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ నుంచి మహిళా వైద్యులు, ఎఫ్ఎల్వో లీడర్స్తో ఒక చర్చాగోష్ఠి నిర్వహించినట్టు ఏఐసీ వెల్లడించింది. ప్రపంచ ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ఫిక్కీ ఎఫ్ఎల్వోతో భాగస్వామ్యం ద్వారా విస్త్రతస్థాయిలో ప్రజలకు చేరువ కావాలన్నది, మహిళల ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ లక్ష్యమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధుల పట్ల దేశవ్యాప్తంగా మహిళలకు అవగాహన కల్పించడంలో ఏఐసీ హాస్పిటల్స్తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ఫీక్కీ ఎఫ్ఎల్వో చైర్పర్సన్ రీతు షా తెలిపారు.