ముంబై, ఏప్రిల్ 2: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ బ్యాంక్ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు తాజాగా లేఖ రాసింది.బ్యాంక్ ఖాతాదారు లు, వాటాదారులు అపనమ్మకంతో ఉన్నారంటూ మంత్రి జోక్యాన్ని ఏఐబీఈఏ కోరింది.
తన నైతికతకు, విలువలకు వ్యతిరేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నడుస్తున్నదంటూ చక్రవర్తి తప్పుకొన్నారు.