AI | భారత్లో ఏఐ భవితవ్యంపై నీలినీడలు పరచుకున్నాయని ఇక్కడ సొంత ఏఐ కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న గూగుల్ మాజీ ఉద్యోగి గౌరవ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు టెక్ కంపెనీలు, టెక్ నిపుణులు, స్టార్టప్ గురువులు, వెంచర్ క్యాపిటలిస్టులు, పరిశ్రమ వ్యక్తులు భారత్లో ఏఐ విప్లవంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపధ్యంలో గౌరవ్ అగర్వాల్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
గౌరవ్ భారత్లో సొంత ఏఐ కంపెనీ అననాస్ ల్యాబ్స్ను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. భారత్లో ఏఐ ప్రస్ధానం ఏమంత సులభం కాదని గౌరవ్ ట్వీట్ సంకేతాలు పంపుతోంది. భారత్లో ఏఐ రీసెర్చి కంపెనీ ప్రారంభించేందుకు గూగుల్ను వీడిన ఏడు నెలలవుతోందని పలు కారణాలతో తన సాహసాన్ని కుదించుకోవాల్సిన పరిస్ధితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. ఏఐ రేస్లో అమెరికా, చైనాను అందుకోవడానికి భారత్ ఎదుట భారీ సవాళ్లున్నాయని గౌరవ్ ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
ఓ దశలో భారత్లో ఏఐ భవిష్యత్ అంధకారమేనని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో ఏఐ కంపెనీని స్ధాపించేందుకు గత ఏడాది ఆగస్ట్లో గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు ఎదురైన అనుభవాలను గౌరవ్ వివరించారు. నిధుల సమస్యతో పాటు పలు అంశాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. మార్కెట్లో నిధులు పుష్కలంగా ఉన్నా ఓపెన్ఏఐ సహా ఇతర సిలికాన్ వ్యాలీ కంపెనీల తరహాలో డీప్ ఏఐ వర్క్ చేపట్టే కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికన్ కంపెనీలు సృష్ఠించిన ఎల్ఎల్ఎం (లార్జ్ లాంగ్వేజ్ మోడల్)పై ఓ లేబుల్ వేసే కంపెనీల్లోకి మాత్రం నిధుల ప్రవాహం వెల్లువెత్తుతోందని గౌరవ్ పెదవివిరిచారు.
Read More :
Bhagwant Mann | మీరు కేజ్రీవాల్ను అరెస్టు చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్