గత వారం స్టాక్ మార్కెట్లలో వివిధ సంస్థల స్క్రిప్ట్లు రికార్డ్ లాభాలు గడించాయి. ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బల పడటంతో స్క్రిప్టులు కొనుగోళ్ల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో టాప్-10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటైలజేషన్ రూ.2.22 లక్షల కోట్లు పెరిగింది. ఎం=క్యాప్ను పెంచుకోవడంలో టాటా గ్రూప్ అనుబంధ టీసీఎస్, రిలయన్స్ ముందు ఉన్నాయి.
ఈ నెల ఆరో తేదీ (శుక్రవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి టీసీఎస్ ఎం-క్యాప్ 52,766 కోట్లు పెరిగి రూ.12.24 లక్షల కోట్లకు చేరుకున్నది. టీసీఎస్తోపాటు రిలయన్స్ ఎం-క్యాప్ రూ.34 వేల కోట్లు పెరిగి రూ.13.24 లక్షల కోట్ల వద్ద స్థిర పడింది.
బ్యాంకింగ్ షేర్లకు మద్దతు లభించడంతో ప్రైవేట్ బ్యాంకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,563 కోట్లు పెరిగి.. రూ.8.26 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 7 లక్షల కోట్లు దాటేసింది. ఇక హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) మార్కెట్ క్యాపిటైలజేషన్ రూ.34,173.81 కోట్లు పెరిగి రూ.4.74 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
ప్రైవేట్ బ్యాంకర్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎం-క్యాప్లో రూ.24,585 కోట్లు జత కలిశాయి. ఫలితంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.52 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.17 వేల కోట్లు పెరిగి రూ.7.02 లక్షల కోట్ల వద్ద స్థిర పడింది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,181 కోట్లతో రూ.4.83 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.6,705.23 కోట్లు ఎక్కువ మొత్తం రూ.5.57 లక్షల కోట్లకు చేరుకున్నది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ మూడు శాతానికి పైగా పెరిగాయి. శుక్రవారం నాటికి నిఫ్టీ 517 పాయింట్లు లబ్ధి పొంది 16,280 పాయింట్ల మార్క్ను దాటేసింది. అలాగే, సెన్సెక్స్ 1,690 పాయింట్లు (3.22 %) శాతం లాభ పడి 54,277 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఈ నెల ఐదో తేదీన సెన్సెక్స్ ఆల్టైమ్ రికార్డు నెలకొల్పి 54,717 పాయింట్లకు దూసుకెళ్లింది.
స్టాక్ మార్కెట్లలో మదుపర్లు లాభాలు గడించడానికి బ్యాంకింగ్ స్టాక్ దన్నుగా నిలిచాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1300 పాయింట్లు మెరుగు పడి 35,884 పాయింట్ల వద్ద స్థిర పడింది. దీంతోపాటు ఐటీ స్టాక్స్లోనూ దూకుడు కనిపించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మూడు శాతం పెరిగింది.