న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఈ ఏడాది మార్చి 31నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణ భారం రూ.2.27 లక్షల కోట్లుగా ఉన్నది. నికర రుణ భారం రూ.1.95 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తం అప్పుల్లో బాండ్ల వాటా గరిష్ఠంగా 39 శాతంగా ఉన్నది. అంతర్జాతీయ బ్యాంకులకిచ్చేది 29 శాతంగా ఉంటే, భారతీయ బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలకు ఇవ్వాల్సినది 32 శాతంగా ఉన్నట్టు కంపెనీ పేర్కొన్న వివరాలనుబట్టి తెలుస్తున్నది. అయితే ఈ ఏడాది మార్చి ఆఖరి నాటికి అదానీ గ్రూప్ స్థూల ఆస్తుల విలువ రూ.3.91 లక్షల కోట్లుగా ఉన్నది. నిజానికి ఈ ఏడాది ఆరంభంలో రూ.14 లక్షల కోట్లకు పైనే. కానీ హిండెన్బర్గ్ దెబ్బకు 10 లక్షల కోట్లకు పైగా సంపద హరించుకు పోయింది. దీంతో సంస్థ రుణ భారం పెద్దగా తయారైంది.