Adani Green Energy | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో బ్లూచిప్ హోదాను దక్కించుకున్నది. టాప్-10 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు బ్లూచిప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న భారతీ ఎయిర్టెల్ను పక్కకు నెట్టేసింది. సోమవారం ట్రేడింగ్లో అదానీ గ్రీన్ షేర్లు 16 శాతానికి పైగా లాభ పడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రీన్ షేర్ విలువ రూ.2,701.55 వద్ద నిలిచింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,22,526.28 కోట్లకు చేరుకున్నది.
భారతీఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.4,16,240.45 కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈలో నాన్సెన్సెక్స్ కంపెనీ.. ఆ ఎక్స్చేంజ్ టాప్-10 సంస్థల్లో ఒకటిగా చేరిన తొలి సంస్థగా అదానీ గ్రీన్ రికార్డు నమోదు చేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీకే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశీయ ఇంధన రంగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిపై అదానీ గ్రీన్ ఎనర్జీ దృష్టి సారించింది. ఫలితంగా గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్లో ఇన్వెస్టర్లకు అదానీ గ్రీన్ ఎనర్జీ హాట్ ఫేవరెట్గా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ సంస్థ షేర్ 1415 శాతం లాభాలు గడించింది.