న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.
అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధ క్షీణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. రాబోయే 18 నెలల్లో లేఆఫ్స్ ప్రక్రియను ముందుకు తీసుకువెళతామని, ఫలితంగా కంపెనీలో 2.5 శాతం ఉద్యోగులు అంటే దాదాపు 19,000 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోతారని కంపెనీ తెలిపింది.
లేఆఫ్స్తో నిమిత్తం లేకుండా ఈ ఏడాది చివరిలో నూతన నియామకాలు కూడా చేపడతామని యాక్సెంచర్ ప్రకటించడం కొంత ఊరట ఇస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ చేపడుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. అయితే అతిగా రిక్రూట్ చేసుకోవడం వల్లే లేఆఫ్స్ తప్పలేదని చెబుతున్నారు. ఇక ఇప్పటికే గూగుల్, అమెజాన్, విప్రో, మెటా సహా పలు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్కు తెగబడ్డాయి.
Read More :
Logitech layoffs | 300 మంది ఉద్యోగులను తొలగించిన లాజిటెక్