న్యూయార్క్ : ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఎప్పటి నుంచో చర్చ సాగుతున్నా చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో ఈ అంశంపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ ఊపందుకుంది. పోటీలో నిలదొక్కుకుని ముందుకు వెళ్లేందుకు కంపెనీలు న్యూ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాగిస్తున్నాయి. కన్వ, లింక్డిన్, మెటా, గూగుల్ వంటి పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రకటించాయి.
ఇక ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సైతం ఏఐపై భారీ ప్రణాళికలతో ముందుకొచ్చింది. ఏఐ స్పేస్లో ఏకంగా 300 కోట్ల డాలర్లు వెచ్చించనుంది. రాబోయే మూడేండ్లలో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు యాక్సెంచర్ సన్నద్ధమైంది. ఇక ఏఐ రంగంలో పనిచేసే ఉద్యోగులను రెట్టింపు చేస్తూ 80,000 మందికి ఉద్యోగుల సంఖ్యను పెంచాలని యోచిస్తోంది.
విస్తృత వృద్ధి, సామర్ధ్యం పెంచుకునేందుకు కంపెనీ రాబోయే మూడేండ్లలో 300 కోట్ల డాలర్లను ఏఐలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిందని, దీంతో అన్ని విభాగాల క్లైంట్లకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ పేర్కొన్నారు. ఇక ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ ఏడాది మార్చిలో ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించగా తాజాగా ఏఐపై భారీ పెట్టుబడులతో పాటు పెద్దసంఖ్యలో ఉద్యోగులను నియమించకుంటామని వెల్లడించింది.
Read More :
Google | మేం స్కూల్ పిల్లలం కాదు : గూగుల్పై ఉద్యోగుల అసహనం