హైదరాబాద్, మే 23: ఆన్లైన్ బస్ టికెటింగ్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్..ప్రచాకర్తగా తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబ్ను మరోసారి నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి అభి అస్యూర్డ్ పేరుతో ప్రత్యేక స్కీంను ప్రకటించినట్టు చెప్పారు.
ఈ స్కీం కింద ఒకవేళ బస్సు రద్దు, ఆలస్యం, కంఫర్ట్ లేకపోయినా టిక్కెట్టు ధర పూర్తిగా తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేల కోట్ల ఆదాయం అంచనావేస్తున్నట్లు చెప్పారు. 16వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ కేవలం రూ.16కే టిక్కెట్టు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని 16 వేల మందికి కల్పించింది. ఈ నెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నది.