హైదరాబాద్, ఆగస్టు 9: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రా న్యూల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం 62 శాతం తగ్గి రూ.4.79 కోట్లకు పడిపోయింది. క్రి తం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.12 కోట్ల లాభాన్ని గడించింది. ఆదాయం కూడా రూ.1,019 కోట్ల నుంచి రూ.9,855 కోట్లకు పడిపోయినట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. వ్యాపారంలో నెలకొన్న అస్తిరత, ఐటీ దాడులు ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు.