2000 Notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. రూ.2వేలనోట్లు ఇప్పటి వరకు 88శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని పేర్కొంది. జులై 31 వరకు మార్కెట్లో ఇంకా రూ.42వేలకోట్ల విలువైన నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని మంగళవారం వెల్లడించింది. తిరిగి వచ్చిన నోట్ల విలువ రూ.3.14లక్షల కోట్లు ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు మార్కెట్లో 3.62లక్షల కోట్ల విలువ రూ.2వేలనోట్లు చెలమణిలో ఉండగా.. మే 19 వరకు 3.56లక్షల కోట్లకు తగ్గింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 19న ఆర్బీఐ రూ.2వేలనోట్లను చెలామణిలో నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే నెల 23 నుంచి ఉప సంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.