Infosys | గతవారం ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.1,09,991.42 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఐటీ మేజర్లు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్ ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్ట పోయాయి. గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 940.37 పాయింట్లు (1.55 శాతం) నష్టంతో ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) స్టాక్స్ మాత్రమే లాభ పడ్డాయి.
టాప్-10 స్క్రిప్ట్ల్లో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,185.37 కోట్లు నష్టపోయి రూ.6,09,687.79 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.18,375.41 కోట్లు పతనమై రూ. 8,89,130 కోట్ల వద్ద ముగిసింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17,289.02 కోట్లు కోల్పోయి, రూ.11,75,287.30 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.14,447.69 కోట్లు పతనమై రూ. 6,07,140.65 కోట్ల వద్ద స్థిర పడింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,245.01 కోట్ల నష్టంతో రూ.5,36,012.18 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.7,419.45 కోట్లు కోల్పోయి రూ.4,74,018.02 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,408.2 కోట్లు నష్టపోయి రూ.17,16,571.25 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.5,621.27 కోట్లు పతనంతో రూ. 4,43,356.45 కోట్లతో సరిపెట్టుకున్నది.
మరోవైపు ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,105.09 కోట్ల వృద్ధితో రూ.4,47,114.09 కోట్లకు చేరుకున్నది. హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.4,053.05 కోట్లు పెరిగి రూ.6,05,489.67 కోట్లకు పుంజుకున్నది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్ -10 సంస్థల్లో రిలయన్స్ లీడ్లో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.