హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్కు చెందిన గేమింగ్ సంస్థ 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్.. ఈ ఏడాది రెండు సరికొత్త మొబైల్ గేమ్స్ను ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఇవి అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయని ఈ మేధో సంపత్తి ఆధారిత స్వతంత్ర గేమ్ డెవలపర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. యూనిక్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్ను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించింది. ‘రీఅస్యూర్ కింగ్’, ‘షూటింగ్ గేమ్’లను త్వరలోనే మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామన్నది. ఇవి ఎంతో ఉత్సాహంగా ఉంటాయని, అత్యంత వినోదాత్మకంగా వీటిని రూపొందించామని సంస్థ ఎండీ ఎల్ మారుతి శంకర్ అన్నారు.