న్యూఢిల్లీ, డిసెంబర్ 20: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పసిడి ధర రూ.300 పెరిగి రూ.63 వేల పైన ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి ధర రూ.63,100గా ఉన్నది. అంతక్రితం రోజు ధర రూ.62,800గా నమోదైంది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.800 ఎగబాకి రూ.78,500 పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,040 డాలర్లు పలుకగా, వెండి 24.07 డాలర్ల వద్ద కొనసాగుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.