హైదరాబాద్, మే 25: దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో..తన ప్లాట్ఫాంలో 6 లక్షల సెల్లర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు ఏడు రెట్లు పెరిగినట్లు తెలిపింది.
ఇటీవల కాలంలో కంపెనీలోకి చిన్న బిజినెస్ సంస్థలు చేరడం కూడా కలిసొచ్చిందని తెలిపింది. ఇటు హైదరాబాద్లోనూ సెల్లర్లు ఆరు శాతం పెరిగారని కంపెనీ సీఎక్స్వో లక్ష్మినారాయణ్ స్వామినాథన్ తెలిపారు.