Fixed Diposits | డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంకులు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు బ్యాంకులు, డిపాజిట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి మరో ఆరు బ్యాంకులు చేరాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐవోబీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. ఈ కొత్త వడ్డీరేట్లు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. వీటిలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీని ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు 8 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఎఫ్డీలపై మిగతా బ్యాంకులు ఇస్తున్న వడ్డీరేట్ల వివరాలు..
444 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.10 శాతం నుంచి 7.30 శాతానికి సవరించింది. ఈ ప్రత్యేక స్కీం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అధికంగా వడ్డీని చెల్లించనున్నది బ్యాంక్.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు 200 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే 365 రోజుల ఎఫ్డీలపై 7 శాతం. అలాగే ఏడాది నుంచి మూడేండ్ల టర్మ్ డిపాజిట్లపై 6.75 శాతం, ఐదేండ్లకంటే అధిక డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
ప్రత్యేక డిపాజిట్ స్కీంలను ప్రవేశపెట్టింది యాక్సిస్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు కనీసంగా 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. అలాగే ఏడాది నుంచి 15 నెలలోపు ఎఫ్డీలపై 7.20 శాతం, 15 నెలల నుంచి 17 నెలల్లోపు డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.
ఐవోబీ 88వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ ఏడాది కొత్తగా 88 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నది. బ్యాంక్ ఎండీ అజయ్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. 1937లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఐవోబీ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా విస్తరించినట్లు, ఈ ఏడాది కొత్తగా 88 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు.