Huge Cash @ Metro Station | దేశ రాజధాని ఢిల్లీలో ఓ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద రూ.58 లక్షల విలువైన కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగ్ను సీఐఎస్ఎఫ్ సిబ్బందికి దొరికింది. ఈ నెల 23న లాల్ ఖ్విలా మెట్రో స్టేషన్ వద్ద రాజు రంజన్ (36) అనే ప్రయాణికుడి వద్ద దొరికిన ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు మంగళవారం తెలిపారు.
ఒక ప్లాస్టిక్ కంపెనీలో రాజు రంజన్ పని చేస్తున్నాడు. వ్యాపార అవసరాల కోసం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు తమ విచారణలో చెప్పాడన్నారు. దీన్ని ధృవీకరించుకునేందుకు మెట్రో స్టేషన్ను పిలిపించాడు. భారీగా డబ్బు తీసుకువెళుతున్న అతడు తమ విచారణలో సంతృప్తికర సమాధానాలు చెప్పకపోవడంతో ఆదాయం పన్నుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
దీనిపై చండీగఢ్లో నివాసం ఉంటున్న అతడి యజమాని అశోక్ బన్సాల్ సమక్షంలో ఐటీ అధికారులు ప్రశ్నించారు. సదరు అశోక్ బన్సాల్ కూడా సమాధానం సంతృప్తికరంగా సమాధానం చెప్పక పోవడంతో ఆ సొమ్ము జప్తు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును ఐటీ శాఖ దర్యాప్తు చేస్తున్నది.