(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనలో ఉద్యోగ కల్పన మృగ్యమవ్వడంతో నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లుతున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైంది. దీంతో దేశంలో నిరుద్యోగం భారీస్థాయిలో పెరిగిపోయింది. దేశంలో ఉద్యోగ కల్పన లేమిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కొత్త సబ్స్రైబర్లకు(పేరోల్ డాటా) సంబంధించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్లో సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన రెండేండ్ల కనిష్ఠానికి చేరిందని ఈ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. అక్టోబర్లో ఈపీఎఫ్వో పోర్టల్లో 7,72,084 మంది కొత్త సబ్స్ర్కైబర్లు నమో దు కాగా, అది నవంబర్లో 5 శాతం మేర పడిపోయి 7,36,015 మంది సబ్స్ర్కైబర్లకు పరిమితమైంది. సెప్టెంబర్తో పోల్చి చూస్తే రెండు నెలల వ్యవధిలోనే కొత్త సబ్స్ర్కైబర్ల సంఖ్య దాదాపు 1.5 లక్షల మేర పడిపోవడం దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగానికి నిదర్శనం. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాటా వెల్లడించింది.
ఈపీఎఫ్వో కొత్త సబ్స్ర్కైబర్లలో తగ్గుదల ఇలా..
నెల కొత్త సబ్స్ర్కైబర్లు