న్యూఢిల్లీ, డిసెంబర్ 14: లగ్జరీ గూడ్స్ జాబితాలో భారత్ మరోమారు సత్తాచాటింది. టాప్-100 జాబితాలో భారత్ నుంచి ఐదు కంపెనీలకు చోటు లభించింది. టాటా గ్రూపునకు చెందిన టైటాన్ స్థానం మూడు స్థానాలు ఎగబాకి 22కి చేరుకున్నది. డెలాయిట్ రూపొందించిన ఈ నివేదికలో పలు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. భారత్ నుంచి కల్యాణ్ జ్యువెల్లరీ, జోయాలుక్కాస్, పీసీ జ్యువెల్లర్స్, టీబీజెడ్ లిమిటెడ్లు ఉన్నాయి. 252 బిలియన్ డాలర్ల వార్షికాదాయం కలిగిన ఈ సంస్థల్లో టీబీజెడ్కు తొలిసారిగా స్థానం దక్కింది.