Weddings | పెండ్లంటే ఏడడుగులు.. వెయ్యేండ్ల పంట.. మేళతాళాల హోరు మధ్య మంగళ సూత్ర ధారణతో దంపతులవుతున్న నవ వధూవరులు. గతంలో పెండ్లంటే ఆ ఊరికి.. ప్రాంతానికే పరిమితం.. కాస్త డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ భారీగా ఖర్చు చేయడానికి వెనక్కి పోవడం లేదు. వధూవరులకు కొత్త బట్టలు.. ఆభరణాలంటే లక్షల్లో ఖర్చు చేయందే పెండ్లి పూర్తి కాదు.. వారి బంధువులకు కొత్త బట్టలు.. విందూ వినోదాలకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు కూడా లక్షలు.. అంతెందుకు ఫొటో కం వీడియో ఆల్బమ్కే రూ.లక్షలు ఖర్చు చేయాలి.
మంచి రోజులు లేకపోవడంతో ఆగస్టులో నిలిచిపోయిన పెండ్లిండ్లు ఈ నెల నాలుగో తేదీ నుంచి పుంజుకుంటున్నాయి. వచ్చే నెల 14 వరకు దాదాపు 32 లక్షల జంటలు.. మంగళ సూత్ర ధారణతో నవ దంపతులు కానున్నారు. ఈ పెండ్లిండ్ల సందర్భంగా జరిగే వ్యాపార లావాదేవీలు దాదాపు రూ.3.75 లక్షల కోట్లు దాటుతాయని బిజినెస్ ఇండస్ట్రీ బాడీ.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 4,302 మంది ట్రేడర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది.
కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ సీజన్లో 3.5 లక్షలకు పైగా పెండ్లిండ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దీంతో రూ.75 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నామన్నారు. గతేడాది ఇదే సీజన్లో 25 లక్షల పెండ్లిండ్లయితే రూ.3 లక్షల కోట్ల బిజినెస్ నమోదైందన్నారు. ప్రస్తుత వివాహ సీజన్లో సుమారు రూ.3.75 లక్షల కోట్ల కొనుగోలు జరుగుతాయన్నారు. తదుపరి జనవరి 14 నుంచి జూలై వరకూ వరుస పెండ్లిండ్లు జరుగనున్నాయని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.
As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022.
Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q
— Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022