న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్న వేళ.. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ తీపికబురును అందించింది. వచ్చే రెండేండ్లలో భారత్లో దాదాపు 30వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న సంస్థ చైర్మన్ బాబ్ మోర్టీజ్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)ను అందిపుచ్చుకోవడంలో భారతీయ యువత ముందుంటున్నదని కొనియాడారు.