లాక్డౌన్లు జూన్ వరకు కొనసాగితే భారీ నష్టం తప్పదన్న బార్క్లేస్
ముంబై, మే 3: దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి. ఈ జాబితాలో అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ కూడా చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 11 శాతం మేరకు వృద్ధి చెందుతుందని గతంలో చెప్పిన ఈ సంస్థ.. తాజాగా తన అంచనాను 10 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా సెకెండ్ వేవ్లో ఎంతమంది కరోనా బారిన పడ్డారు? ఎంత మంది చనిపోయారు? అన్న దానిపై అనిశ్చితి నెలకొన్నందున జీడీపీ వృద్ధి రేటును కుదిస్తున్నామని వెల్లడించింది. కరోనా కట్టడికి ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా విధించిన లాక్డౌన్లు జూన్ నెలాఖరు వరకు కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు 38.4 బిలియన్ డాలర్ల (రూ.2,83,533 కోట్ల) నష్టం వాటిల్లుతుందని బార్క్లేస్ స్పష్టం చేసింది.