హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. వచ్చే నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు నేషనల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్(ఎన్హెచ్ఆర్డీ) వార్షిక కాన్ఫరెన్స్ జరుగబోతున్నది. వెయ్యి మంది డెలిగేట్లు, 100 మంది వక్తలు పాల్గొంటున్న ఈ జాతీయ సదస్సును రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వార్షిక సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఆర్ నిపుణులు, ప్రొషెనల్స్ హాజరుకానున్నట్లు ఎన్హెచ్ఆర్డీ-హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్ తెలిపారు. 25వ సారి జరుగుతున్న ఈ వార్షిక సమావేశాలు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉన్నదని, హెచ్ఆర్లో వస్తున్న మార్పులు, టెక్నాలజీ పరంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.