న్యూఢిల్లీ : మారుతి సుజుకి అప్గ్రేడ్ ఇంజన్, కాస్మెటిక్ మార్పులతో 2022 వాగనార్ను లాంఛ్ చేసింది. రూ 5.40 లక్షల నుంచి న్యూ వాగనార్ అందుబాటులో ఉంటుంది. రెండు న్యూ కలర్ ఆప్షన్స్తో పాటు నూతన కార్బన్ ఎమిజన్ నిబంధనలకు అనుగుణంగా ఇంజన్లను అప్గ్రేడ్ చేసింది. హానికారక వాయువులను తగ్గిస్తూ మెరుగైన ఇంధన సామర్ధ్యం కల్పించేలా నూతన ఇంజన్లను అప్గ్రేడ్ చేసింది.
జడ్ఎక్స్ఐ+ ట్రిమ్లో గ్యాలంట్ రెడ్, మ్యాగ్మా గ్రే కలర్ ఆప్షన్ను రూ 12,000 అదనంగా చెల్లించి ఎంపిక చేసుకోవచ్చు. జడ్ఎక్స్ఐ+లో వాగనార్ ఇప్పుడు అలాయ్ వీల్స్లో లభిస్తుంది. ఇక డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేపట్టలేదు. ఇక ఇంటీరియర్స్లో డ్యూయల్ టోన్ డార్క్ గ్రే వంటి స్వల్ప మార్పులను జోడించారు. ఫీచర్లలో సైతం ఎలాంటి మార్పులనూ జోడించేదు.
స్మార్ట్ప్లే స్టూడియో ఇన్ఫోటెయిన్మెంట్ సూట్ కోసం 7 ఇంచ్ టచ్స్క్రీన్ డిస్ప్లే, స్మార్ట్ఫోన్ బేస్డ్ నేవిగేషన్, ఆడియో అవుట్పుట్ కోసం 4 స్పీకర్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ వంటి పీచర్లు ఆకట్టుకుంటాయి. న్యూ మారుతి సుజుకి వాగనార్ రూ 5,39,500 నుంచి రూ 7,10,000 మధ్య అందుబాటులో ఉంది.