న్యూఢిల్లీ : 2022 న్యూ హ్యుందాయ్ వెన్యూను ఈనెల 16న లాంఛ్ చేయనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. న్యూ హ్యుందాయ్ వెన్యూ బుకింగ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. అంతర్జాతీయంగా సేల్ అవుతున్న న్యూ టక్సన్ను పోలి ఉండేలా 2022 హ్యుందాయ్ వెన్యూ ముందుభాగం డిజైన్లో భారీ మార్పులు చేపట్టారు.
స్ల్పిట్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్తో క్రోమ్ గ్రిల్ అతిపెద్ద ఛేంజ్ అప్డేట్గా చెబుతున్నారు. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, న్యూ ఫ్రంట్ బంపర్ లేటెస్ట్ వెహికల్కు సరికొత్త లుక్ను తీసుకువచ్చాయి. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా మార్చారు. న్యూ వెన్యూలో ఐదు ట్రిమ్లను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, పాంథమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, టైటన్ గ్రే, ఫియరీ రెడ్ కలర్స్లో హ్యుందాయ్ వెన్యూ అందుబాటులో ఉంటుంది. 2019లో లాంఛ్ అయినప్పటి నుంచి హ్యుందాయ్ వెన్యూ భారత్ మార్కెట్లో గ్రాండ్ సక్సెస్ అయిందని, న్యూ హ్యుందాయ్ వెన్యూతో కస్టమర్లకు తాము మరింత దగ్గరవుతామని హ్యుందాయ్ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు.