న్యూఢిల్లీ : డుకాటి ఇండియా భారత్ మార్కెట్లో ఆల్ న్యూ 2021 డుకాటి హైపర్మోటార్డ్ 950 శ్రేణిని లాంఛ్ చేసింది. ఈ బైక్ల శ్రేణి ధర వేరియంట్ను బట్టి రూ 12.99 లక్షల నుంచి రూ 16.24 లక్షల వరకూ అందుబాటులో ఉంది. న్యూ డుకాటి హైపర్మోటార్డ్ 950 శ్రేణి డుకాటి రెడ్ ఫ్రేం, బ్లాక్ వీల్ రిమ్సతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
గ్లోబల్ మార్కెట్లో ఆల్ న్యూ హైపర్మోటార్డ్ 950 విజయవంతమవడంతో ఈ బైక్ల శ్రేణిని దేశీ మార్కెట్లోకి తీసుకువచ్చామని డుకాటి ఇండియా ఎండీ విపుల్ చంద్ర తెలిపారు. ఈ న్యూ బైక్ ఫన్ బైక్ అనుభూతిని ఇవ్వడంతో పాటు హైలెవెల్ థ్రిల్, నడిపేసమయంలో మెరుగైన కంట్రోల్ను ఇచ్చేలా డిజైన్ చేశామని వెల్లడించారు.