న్యూఢిల్లీ, మే 27:నిర్దిష్ఠ పరిమితికి మించి రూ. 2,000 నోట్లు భారీగా డిపాజిట్ జరిగితే, ఆ లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు బ్యాంక్లు తెలియపర్చాలి. టెర్మ్ డిపాజిట్, సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 10 లక్షలు, కరెంట్ ఖాతా డిపాజిట్లు రూ. 50 లక్షలు మించినా బ్యాంక్లు..ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్లో భాగంగా ఆదాయపు పన్ను అధికారులకు నివేదించాలి.
వాస్తవానికి వార్షిక స్టేట్మెంట్లో భాగంగా బ్యాంక్లు ఐటీ శాఖకు ఈ సమాచారాన్ని ఇస్తుంటాయి. అందులో ఏ గుణిజాల్లో నోట్లను డిపాజిట్ చేశారన్న వివరాలేవీ ఉండవు. కానీ పదేపదే రూ.2000 నోట్లను డిపాజిట్ అవుతున్న ఖాతాల సమాచారాన్ని ఐటీ శాఖకు బ్యాంక్లు సమర్పిస్తాయని, బ్యాంక్లు అందించిన డాటాను శోధించి పన్ను ఎగవేతల్ని కనుగొనే పనిలో ఆదాయపు పన్ను శాఖ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.