న్యూఢిల్లీ, మే 11: టెలికం దిగ్గజాలు మొబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలోకి 10 లక్షల మంది చేరగా, అదే భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 9.82 లక్షల మంది ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
కానీ, వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. జనవరిలో 42.61 కోట్లుగా ఉన్న జియో సబ్స్ర్కైబర్లు ఆ తర్వాతి నెల చివరినాటికి 42.71 కోట్లకు చేరుకున్నారు. 9.82 లక్షల మంది ఎయిర్టెల్ నెట్వర్క్ను ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 36.98 కోట్లకు చేరుకున్నారు.