న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయై మారుతి సుజుకీకి చెందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనోకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. విక్రయాల్లో 10 లక్షల మైలురాయికి చేరుకున్నది. 2015 అక్టోబర్లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మోడల్..తొలి ఐదు లక్షల యూనిట్లను కేవలం మూడేండ్లలో విక్రయించగా..ఆ మరుసటి ఐదు లక్షల యూనిట్లను మరో మూడు నెలల్లో విక్రయించింది. ఈ సందర్భంగా మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ..మార్కెట్లోకి విడుదలైన నాటి నుంచి వినియోగదారుల మన్నలను పొందిందని, ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో తొలిస్థానంలోనే కొనసాగుతున్నదన్నారు. ఈ విభాగంలో 25 శాతం వాటా కలిగివున్నది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూంలో లభించనున్నది.