హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రతి పౌరుడు పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్యాకేజింగ్ ఇన్నోవేషన్స్-2023 మూడో ఎడిషన్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుతమైన అభివృద్ధికి అనుగుణంగా స్థిరమైన సాంకేతికతలపై పరిశ్రమలు దృష్టిపెట్టాలని సూచించారు. ఇలాంటి పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ ఏ వాణిప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్, సీఎస్ఆర్ ఎస్టేట్స్ లిమిటెడ్ చైర్మన్ శేఖర్రెడ్డి, సీఐఐ టీఎస్ ప్యాకాన్, ఏవీపీఎస్ చైర్మన్ చక్రవర్తి, జెమినీ ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ దరి, క్రీమ్లైన్ డైరీ ఎండీ భాస్కర్రెడ్డి, వసంత టూల్ క్రాఫ్ట్స్ ఎండీ దయానంద్రెడ్డి, గ్లోబల్ లాజిస్టిక్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మేనేజ్మెంట్ ఎండీ డాక్టర్ రవిప్రకాశ్ మాథుర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ హైదరాబాద్ చైర్పర్సన్ శంకర్ పటేల్, ప్యాకేజింగ్ పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు, డిజైనర్లు, విక్రయదారులు పాల్గొన్నారు.