న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మంగళవారం ట్వీట్ చేశారు. అదే రోజున స్కూటర్ స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలతో పాటు స్కూటర్ లభించే తేదీలను కూడా వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ స్కూటర్ ధర రూ.85,000-రూ.1,10,000 మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.