న్యూఢిల్లీ, మార్చి 4: డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. లీటర్ డీజిల్పై 50 పైసలకు తగ్గించింది. కానీ, దేశీయంగా చమురును ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు మోదీ సర్కార్ షాకిచ్చింది. లెవీ పన్నును మరో రూ.50 వడ్డించింది. దీంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)పై టన్ను ధర రూ.4,350 నుంచి రూ.4,400కి సవరించింది. ఈ పెంపు శనివారం నుంచే అమలులోకి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న డీజిల్పై పన్ను రూ.2.5 ఉండగా, దీనిని 50 పైసలు తగ్గించింది. అలాగే ఏటీఎఫ్పై విధిస్తున్న రూ.1.50 విండ్ఫాల్ ట్యాక్స్ను సున్నకు దించింది. గత పదిహేను రోజుల్లో విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న కూడా తగ్గించిన విషయం తెలిసిందే.