హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశీయ ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.903.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రమే ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.2,046.88 కోట్ల లాభంతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. అటు ఆదాయం రూ.3,924.75 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు రూ.2,693.01 కోట్లకు తగ్గినప్పటికీ నిరాశే ఎదురైంది.