దమ్మపేట: మండల పరిధిలోని నాచారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీవేణుగోపాలస్వామిని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట గ్రామపెద్దలు ఎల్లిన రాఘవరావు, ఎర్రగొర్ల రాధాకృష్ణ, హరిబాబు, పెద్దబోయిన పవన్, ఆలయకమిటీ సభ్యులు ఉన్నారు.