హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. బుధవారం తిరుమలలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. గత పాలకమండలి పదవీకాలం జూన్ 22తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి అవకాశమిచ్చిది. పాలకమండలి సభ్యులను త్వరలో నియమించనున్నారు.