(YV Subbareddy) తిరుపతి: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి పనులను తిరుమల, తిరుపతి దేవస్తానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. మహిళల రక్షణ కేంద్రంతోపాటు కే ఎల్ రావు బ్లాకు, ఔషధ మొక్కల గార్డెన్ ను సుబ్బారెడ్డి చేతుల మీదుగా వర్శిటీ అధికారులు ప్రారంభించుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీని కూడా సుబ్బారెడ్డి సందర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన జీవనోపాధి వ్యాపార ఇంక్యుబేటర్ కోసం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.98.8 లక్షలు అందించింది. దీని ద్వారా ఏటా 600 మంది విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతారు. మహిళలతో పాటు బయటి విద్యార్థులు బేకరీ ఉత్పత్తుల తయారీ, ఎంబ్రాయిడరీ తదితరాలపై శిక్షణ పొంది ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తారు.
ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పద్మావతి విశ్వవిద్యాలయం ఆవరణలో శ్రీవారి ఆలయాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ ఆలయాన్ని రూ.20 లక్షల టీటీడీ నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాసుడి అండదండలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి టీటీడీ 130 ఎకరాల భూమిని అందించిందని, అలాగే ఏటా కోటి రూపాయల గ్రాంట్ను ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్ డీ జమున, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డీఎం మమత, ప్రొఫెసర్ సూర్యకుమార్, ప్రొఫెసర్ నాగరాజు, ప్రొఫెసర్ సుజాత, ప్రొఫెసర్ జీవనజ్యోతి, ఈఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..