త్వరలో పాలకమండలి సభ్యుల నియామకం
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు ఈ పదవి అప్పగించడం ఇది రెండోసారి. ఇటీవలనే తొలి విడత రెండున్నరేండ్ల పదవీకాలం ముగిసింది. టీటీడీ పాలకమండలి సభ్యులను త్వరలో నియమించనున్నట్టు సమాచారం. ఇంతకుముందు పాలకమండలి సభ్యుల సంఖ్య18 మాత్రమే ఉండగా, జగన్ దానిని 37కు పెంచారు. ఆశావహుల సంఖ్య పెరగడం, ఒత్తిడి అధికంగా ఉండటంతో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.