అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడు , వైఎస్సార్సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి డిసెంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధిస్తు పులివెందుల కోర్టు తీర్పు నిచ్చింది. నిన్న హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీబీఐ అధికారులు శివశంకర్రెడ్డిని అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి కోర్టు అనుమతితో కడపకు తరలించారు.
గురువారం కడప రిమ్స్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి అతడిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు . కోర్టు వద్ద శివశంకర్రెడ్డిని కలిసేందుకు పార్లమెంట్ సభ్యుడు అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదని శివశంకర్రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి సీబీఐకి లేఖ రాశారు.