AP Elections | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీని ఓడించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలను సీఎం జగన్ ధీటుగా ఎదుర్కొంటారని పలు సర్వేల్లో వెల్లడవుతోంది. అయితే తాజాగా విడుదలైన C-PAC సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. ఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీనే అధికారం చేపట్టబోతుందని ఆ సర్వేలో తేలింది. ఇక రెండో స్థానంలో టీడీపీ నిలబడే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్, జనసేన, బీజేపీ గెలిచే స్థితిలో లేదని ఆ సర్వేలో తేలింది.
త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 121, తెలుగు దేశం పార్టీకి 52, కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉన్నట్లు C-PAC సర్వేలో వెల్లడైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151, టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో గెలుపొందిన సంగతి తెలిసిందే.