AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్ఠానం.. తాజాగా 10 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాను మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
రాజమండ్రి – డా.గూడూరి శ్రీనివాస్
నర్సాపూరం – అడ్వకేట్ గూడూరి ఉమాబాల
గుంటూరు – ఉమ్మారెడ్డి వెంకట రమణ
చిత్తూరు(ఎస్సీ) – ఎన్.రెడ్డప్ప
మైలవరం – నర్నాల తిరుపతిరావు యాదవ్
మార్కాపురం – అన్నా రాంబాబు
గిద్దలూరు – కె.నాగార్జున రెడ్డి
నెల్లూరు సిటీ – ఎండీ.ఖలీల్ (డిప్యూటీ మేయర్)
జీడీ, నెల్లూరు – కె.నారాయణస్వామి
ఎమ్మిగనూరు – బుట్టా రేణుక