AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసింది. ఈ మేరకు నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించినట్లు తెలిపారు.
అసెంబ్లీ ఇన్ఛార్జిల జాబితా..
జీడీ నెల్లూరు (ఎస్సీ) – ఎన్.రెడ్డప్ప
శింగనమల (ఎస్సీ)- వీరాంజనేయులు
నందికొట్కూరు (ఎస్సీ) – డాక్టర్ సుధీర్ దారా
తిరువూరు(ఎస్సీ) – నల్లగట్ల స్వామిదాస్
మడకశిర(ఎస్సీ) – ఈర లక్కప్ప
కొవ్వూరు (ఎస్సీ) – తలారి వెంకట్రావు
గోపాలపురం(ఎస్సీ) – తానేటి వనిత
కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్