విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కరీమున్నిసా(65) గుండెపోటుతో మృతి చెందారు. గతేడాది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కరీమున్నిసా నిన్న మండలి సమావేశాలకు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కరీమున్నిసా తుదిశ్వాస విడిచింది. కరీమున్నిసా మృతిపట్ల వైసీపీ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.