ఏపీలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముగిసింది. వారందరికీ శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. దీంతో ఏపీ సీఎం జగన్ అసంతృప్తులపై దృష్టి సారించారు. మంత్రి పదవులు ఆశించి, భంగపడ్డ అసంతృప్త ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని బుజ్జగించారు. ఏఏ పరిస్థితుల్లో వారికి మంత్రి పదవులు రాలేదో వారికి వివరించారు. దీంతో వారు మెత్తబడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మరో సీనియర్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీఎంతో భేటీ అయ్యారు.
సీఎం జగన్తో భేటీ అయిన తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి మాట్లాడుతూ… మంత్రి పదవి రానందుకు తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. 2014 ఎన్నికలే తమ లక్ష్యమని, ఆ టార్గెట్గానే ముందుకు సాగుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు.
మంత్రి పదవి రానందున తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లిని బుజ్జగించే బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. దీంతో పిన్నెల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత వీరందరూ సీఎం జగన్తో భేటీ అయ్యారు.